ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం జరిగింది. కొండపై నుంచి జారిపడి తండ్రి, కొడుకు మరణించగా, తల్లి కూడా అదే కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొదట కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కొండ అంచుకు వెళ్లాడు. కిందికి రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతగానో బతిమాలారు. వినకపోవడంతో రక్షించడానికి తండ్రి కొండపైకి ఎక్కాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ జారిపడి మృతి చెందారు. వాళ్ల మరణాన్ని కళ్లెదుటే చూసిన తల్లి అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు విడిచారు.



