← Back to news

ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!

By rajaratnam· 2d ago
ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రత్యేక సదస్సు జరిగింది. ఎల్నినో కారణంగా వాతావరణ మార్పులపై నిమ్మ రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మకు ఆశించే ఎర్రనల్లి, ఎండితెగులు, బంకతెగుల నివారణ చర్యలు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ అనిల్, తెనాలి అధికారి యు.శ్రీనిత్య హాజరయ్యారు. ‘‘వ్యాధులు అంతుచిక్కకపోతే పంటే పూర్తిగా దెబ్బతింటుంది కదా! రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అవగాహన సదస్సులకు హాజరు కావాల’’ని వారు చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.