ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రత్యేక సదస్సు జరిగింది. ఎల్నినో కారణంగా వాతావరణ మార్పులపై నిమ్మ రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మకు ఆశించే ఎర్రనల్లి, ఎండితెగులు, బంకతెగుల నివారణ చర్యలు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ అనిల్, తెనాలి అధికారి యు.శ్రీనిత్య హాజరయ్యారు. ‘‘వ్యాధులు అంతుచిక్కకపోతే పంటే పూర్తిగా దెబ్బతింటుంది కదా! రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అవగాహన సదస్సులకు హాజరు కావాల’’ని వారు చెప్పారు.



