సింహాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

AP: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక గిరి ప్రదక్షిణ ఈరోజు ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిరాకరించారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు, రేపు ఆర్జిత సేవలను రద్దు చేసి, జిల్లాలోని 221 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.



