← Back to news

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు

By samson· 2d ago
కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు

భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 420 మీటర్ల బ్యానర్, మానవహారంతో ఆందోళన వ్యక్తం చేశారు. రూ.49 వేల కోట్ల రుణమాఫీకి బదులు రూ.18 వేల కోట్లే చేశారని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలను దగా చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుట్రపన్నుతున్నాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.