← Back to news

టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడి అరెస్టు

By Vishi· 3d ago
టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడి అరెస్టు

TG: హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన హిట్-అండ్-రన్ ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ మరణించాడు. అతనికి సాయం చేయడానికి వచ్చిన స్టూడెంట్ జైద్ షా కాద్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ORR రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రోడ్డుపై నడుస్తున్న నందులాల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. అతనికి సాయం చేస్తున్న స్టూడెంట్‌ను కూడా అదే కారు ఢీకొట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. CCTV ఆధారంగా వాహనాన్ని గుర్తించి, ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు.

More in Current Affairs