← Back to news

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా!

By mahesh anthati· 20 Aug 2026· రాజన్న సిరిసిల్ల
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఎం ధర్నా!

TG : ఉద్యోగాల నియామకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలను పక్కనబెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

More in Local