కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం

AP : అరకులోయ మండలంలో కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అప్లికేషన్ల ప్రాసెస్ సోమవారం స్టార్ట్ అయింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఈ నెల 16 లోపు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని MPDO ప్రసాద్ చెప్పారు. ఆధార్, రైస్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్తో పాటు కేటగిరీని బట్టి అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. ఆన్లైన్ నమోదు, ekyc పూర్తయ్యాక పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు.



