దళితుల సమస్యలు పరిష్కరించాలి

TG : రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే సాల్వ్ చేయాలని DHPC జిల్లా కార్యదర్శి వెంగళ ఆనందరావు డిమాండ్ చేశారు. వేంసూరు మండలం కందుకూరులో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల సాయం, అసైన్డ్, పోడు భూములకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.



