మహబూబ్నగర్లో భారీ ర్యాలీ..
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా మహబూబ్నగర్లో విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీని నేతలు తీవ్రంగా ఖండించారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్లకార్డులతో భారీస్థాయిలో నిరసన తెలిపారు.





