ఝార్ఖండ్లో విద్యార్థుల గెలుపు.. సగం డిమాండ్లకు పరిష్కారం!

ఝార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షల అవకతవకలపై స్టూడెంట్స్ నిరసనలకు ప్రభుత్వం స్పందించింది. JSSC-CGL పరీక్షను రద్దు చేయడంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ TDPL నిర్వహించిన 2014 నుంచి అన్ని పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల కోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడంతో విద్యార్థుల కొన్ని డిమాండ్లు నెరవేరాయి. అయితే అన్ని డిమాండ్లు పూర్తిగా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా అవకతవకలపై CBIతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ అంశంపై విద్యార్థుల అసంతృప్తి కొనసాగుతోంది.



