బాలీవుడ్ హీరోలకు షోకాజ్ నోటీసులు

బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర FDA(Food and Drug Administration) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల యాడ్లో యాక్ట్ చేసి, నిషేధిత పాన్ మసాలాను ప్రోత్సహించారని తెలిపింది. ఆ యాడ్స్ ప్రచారం వెంటనే ఆపాలని, సోషల్ మీడియా నుంచి కంటెంట్ తొలగించాలని ఆదేశించారు. అగ్రిమెంట్లు, పారితోషిక వివరాలు సబ్మిట్ చేయాలని కోరారు.


