మోదీ 'Dimagi Naxals' వ్యాఖ్యలపై ప్రకాశ్రాజ్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్రాజ్ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని ఇలా పిలుస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశవిరోధులు’ అంటూ పేర్లు పెట్టారని, ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అని కొత్త పేరు పెట్టారని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితిని ప్రజలకు చూపిస్తున్న ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమాన్ని కూడా ప్రస్తావించారు.



