బకాయిలు కట్టాల్సిందే.. మిల్లర్లకు CM గట్టి వార్నింగ్

TG: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం డబ్బు మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయాలని CM రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కావాలనే బకాయిల ఎగవేతకు ప్రయత్నించే మిల్లర్లపై స్ట్రిక్ట్గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. బకాయిల వసూలుకు ప్రొసీజర్స్ రూపొందించి క్యాబినెట్ సబ్-కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సూచించారు. ధాన్యం స్టోరేజ్ సమస్యకు పూర్తి పరిష్కారంగా నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ల ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


