కోహ్లీని దాటేసిన షారుఖ్ ఖాన్

'క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025' రిపోర్ట్ ప్రకారం, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ $177.9 మిలియన్ల బ్రాండ్ వాల్యూతో టాప్లో నిలిచారు. ఈ లిస్ట్లో రణ్వీర్ సింగ్ ($162.9 మిలియన్లు) రెండో స్థానాన్ని, కోహ్లీ ($158.4 మిలియన్లు) మూడో స్థానంలో నిలిచారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. AI టెక్నాలజీ వల్ల బ్రాండ్లు, సెలబ్రిటీల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే వాళ్ల బ్రాండ్ వ్యాల్యూలు ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.



