స్టూడెంట్స్తో డ్యామ్లో స్నానం.. ప్రిన్సిపాల్పై యాక్షన్!
రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో స్టూడెంట్స్తో కలిసి డ్యామ్లో స్నానం చేసినట్లు Govt. స్కూల్ ప్రిన్సిపాల్ లాల్చంద్ మీనాపై ఆరోపణలొచ్చాయి. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. స్టూడెంట్స్తో ఆయన డ్యామ్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు. ఆగస్ట్ 15న 200 మందికి పైగా స్టూడెంట్స్ను డ్యామ్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ స్నానం చేయడంపై బ్యాన్ ఉన్నప్పటికీ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రిన్సిపాల్పై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకు ఆదేశించారు.



