← Back to news

రాజీనామా చాలదు.. ₹1 కోటి ఇవ్వాల్సిందే!

By sahani· 25 Jul 2026· X· Delhi

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై CJP నేత అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్య విజయమని ప్రకటించారు. అయితే తమ పోరాటం ఇక్కడితో ఆగదని, పేపర్ లీక్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జులై 20న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నమోదైన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

More in Politics