రాజీనామా చాలదు.. ₹1 కోటి ఇవ్వాల్సిందే!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై CJP నేత అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్య విజయమని ప్రకటించారు. అయితే తమ పోరాటం ఇక్కడితో ఆగదని, పేపర్ లీక్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జులై 20న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నమోదైన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.



