చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పునఃప్రారంభం

AP: ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న వాహనదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది.. దిండి–చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే ఈ వంతెనపై మరమ్మతుల కారణంగా గత ఏడాది నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చి అదనపు సమయం, ఖర్చుతో ఇబ్బందులు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వంతెనపై భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చారు.



