హైదరాబాద్లో ఇక రాత్రివేళల్లోనూ బస్సు సర్వీసులు

హైదరాబాద్ నగరంలో ఇకపై అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29 నుంచి హైదరాబాద్లోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సులు నడపనున్నారు. ఐటీ ఉద్యోగులు, హోటళ్లు, హాస్పిటాలిటీ రంగం, షాపింగ్ మాల్స్, ఇతర నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.


