ఢిల్లీ పోలీసుల కీలక హెచ్చరిక!

రిజర్వేషన్ సంస్కరణలపై జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆదివారం (ఆగస్టు 23, 2026) జంతర్ మంతర్ వద్దకు రావాలని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అబద్ధమని.. వాటిని నమ్మి ఎవరూ అక్కడికి రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


