తెలంగాణ లో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి: SFI
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కోరారు.



