← Back to news

రీయంబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల

By DK· 11 Jun 2026· Dishadaily· నాగర్ కర్నూల్ జిల్లా
రీయంబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల

TG: నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం ఊడిమిళ్ల విలేజ్‌కు చెందిన పాపమ్మ, బయన్న దంపతులు తన కుమార్తె ఎస్తేరమ్మ ఉన్నత విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఐటీడీఏ నుంచి రూ.50వేల ఆర్థిక సహాయం అందడంతో మిర్యాలగూడలోని మీనా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) పూర్తిచేసింది. తదుపరి విద్యను కొనసాగించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్ రాలేదని, అది వచ్చిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పినట్లు ఎస్తేరమ్మ తెలిపింది.

More in Education