← Back to news

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

By Srinivas· 2d ago
క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

TG: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శాలెం ఎం.బి. చర్చిని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పాస్టర్‌తో మాట్లాడి చర్చి, క్రిస్టియన్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రైస్తవుల సంక్షేమం, చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన అభివృద్ధి పనులకు తన ఎమ్మెల్యే నిధుల నుంచి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చర్చి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.