ఆ కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావు: బాంబే హైకోర్టు

శ్రీరాముడి గురించి MIM నాయకుడు, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్పై ఫైల్ అయిన కేసు కొట్టివేయాలని ఆయన వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఒవైసీ 2011లో మహారాష్ట్రలోని నాందేడ్ ఎన్నికల ప్రసంగంలో ఈ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా 2013లో కంప్లైంట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఉన్న కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావని కోర్టు అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలు సాధారణ పౌరుల కంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలని చెప్పింది.


