మద్రాస్ ఐఐటిలో వంద రూపాయలకే ఏఐ కోర్సులు !1

మద్రాస్ ఐఐటి వినూత్నంగా వంద రూపాయలకే ఏఐ కోర్సులు అందిస్తోంది. మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ కోర్సుకు ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే. అలాగే ఏఐ ప్లాట్ ఫామ్ ను సమర్ధవంతంగా యూజ్ చేసుకోవాలనుకునేవారికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సు ఫీజు కూడా వంద రూపాయలే. ఏఐ ఫర్ యాస్పైరింగ్ ఇంజనీర్స్ కోర్సుకు మాత్రం ఫీజు రూ.500 గా డిసైడ్ చేశారు. వీటికి జీఎస్టీ అదనం. ఈ కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు మే 10 లోగా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.


