← Back to news

కృష్ణా, గోదావరి జలాలపై కలిసి పోరాడాలి

By dk· 3 Aug 2026· తూర్పుగోదావరి జిల్లా
కృష్ణా, గోదావరి జలాలపై కలిసి పోరాడాలి

AP: గోదావరి, కృష్ణా నది జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలైతే ఏపీ, తెలంగాణ రెండూ నీటి నష్టాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించారు. దీనిపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పోరాడాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

More in AP