← Back to news

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు

By DK· 26 Jul 2026· కర్నూలు జిల్లా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ మేధ (AI) డాక్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన ఆయన, ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఏఐ ఆధారిత వైద్యం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, అభా హెల్త్ ఐడీలతో వైద్యసేవలను మరింత ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆధార్‌తో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా రోగి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

More in Health