వీఆర్ఓ ఆరోగ్యంపై తహసీల్దార్ ప్రత్యేక పర్యవేక్షణ

AP: కర్నూలు జిల్లా హొలగుంద మండలం లింగంపల్లిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ రామచంద్ర ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తుండగా అస్వస్థతకు గురైన ఆయనను విషయం తెలుసుకున్న హొలగుంద తహసీల్దార్ లక్ష్మీరాజు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. చికిత్స పూర్తయ్యే వరకు రామచంద్ర ఆరోగ్య పరిస్థితిని తహసీల్దార్ పర్యవేక్షిస్తూ వివరాలు తెలుసుకున్నారు. వీఆర్వో ప్రాణాలను కాపాడేందుకు కృషిచేసిన అధికారులకు అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు.



