← Back to news

బైక్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్

By Mohan Digitals· 28 Aug 2026

AP: విజయనగరం జిల్లా రాజాంలో రౌడీషీటర్‌తోపాటు మరోఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనదారుడిని బెదిరించి డబ్బులు, బైక్ లాక్కున్న ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజాం మెంతిపేటకు చెందిన రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు అలియాస్ దేవా, పెనుబాకకు చెందిన దిలీప్, ప్రసాద్‌లు ఫైర్‌స్టేషన్ మామిడితోట వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించారు. తమ వద్ద ఉన్న డబ్బులు, బైక్ ఇవ్వకపోతే కొట్టి చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు భయపడి వాటిని అప్పగించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.

More in Local