'ఛాత్రో కీ గూంజ్' .. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పూణేలోని ఏఐఎస్ఎస్ఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (AISSMS) ఆవరణలో విద్యార్థినులతో మాట్లాడారు. 'ఛాత్రో కీ గూంజ్' (Chhatron Ki Goonj) పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని విద్యావ్యవస్థ, ఉపాధి, యువత సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముందు ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు 50-60 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.



