← Back to news

'ఛాత్రో కీ గూంజ్' .. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు

By Vishi· 22 Aug 2026

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పూణేలోని ఏఐఎస్‌ఎస్‌ఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (AISSMS) ఆవరణలో విద్యార్థినులతో మాట్లాడారు. 'ఛాత్రో కీ గూంజ్' (Chhatron Ki Goonj) పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని విద్యావ్యవస్థ, ఉపాధి, యువత సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముందు ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు 50-60 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.