ఆలయం కూల్చివేతపై పాకిస్థాన్కు ఇండియా వార్నింగ్!

పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవాల్ జిల్లాలో 100 ఏళ్లకు పైబడిన హిందూ ఆలయం ఆగస్టు 21న కూల్చివేతకు గురైంది. ఆలయ స్థలాన్ని పక్కనే ఉన్న మదరసా కోసం ఉపయోగించేందుకు కావాలనే కూల్చేశారని హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇండియా తీవ్రంగా స్పందిస్తూ దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేసింది. మైనారిటీల భద్రతపైనా పాకిస్థాన్ను హెచ్చరించింది.



