← Back to news

యువత గొంతు నొక్కితే BJP పతనం ఖాయం

By DK· 24 Jul 2026
యువత గొంతు నొక్కితే BJP పతనం ఖాయం

TG: యువత గొంతు నొక్కితే BJP రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లాఠీచార్జీలు, కేసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కేనని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుందని, రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిసి నిలబడటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.

More in Politics