రేపు ఇందిరా పార్క్ వేదికగా BRSV నిరసన.. కేటీఆర్ హాజరు

TG: దిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(BRSV) జులై 24 ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిరసన చేపట్టనున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కేంద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విద్యార్థులు, యువత పాల్గొనాలని BRSV పిలుపునిచ్చింది.



