G.O.97 శక్తి పథకం రద్దు చెయ్యాలి

TG: పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ను ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పడానికి నిరసన చేపడితే, స్పీకర్ పర్యటన ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం ఎందుకు అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును వినాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఐటీఐ వారితో సమానం చేసే G.O. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.





