← Back to news

ఆర్టీసీ విలీనానికి కమిటీ.. రోడ్డెక్కిన బస్సులు

By aravinda nyayapati· 25 Apr 2026· Hyderabad
ఆర్టీసీ విలీనానికి కమిటీ.. రోడ్డెక్కిన బస్సులు

ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కార్మికుల జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11% ఫిట్ మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో ఒక కమిటీ వేస్తామని అర్థరాత్రి దాటాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో సమ్మెకు తెరపడింది. ఇవాళ ఉదయం నుంచి యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.

More in Local