మోదీపై బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని అన్నారు. దీనిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇన్స్టాలో స్పందించారు. ఈ ముసలివాళ్లు ‘దిమాగీ నక్సల్’ అని అనగానే ఏదో బ్రహ్మాస్త్రం వదిలేశామని అనుకుంటున్నారని, అయితే పిల్లలకు నక్సల్ అంటే ఏమిటో తెలియదని రాశారు. పుస్తకాల్లోనుంచి తొలగించిన చాప్టర్లను తిరిగి పెట్టమని పేర్కొన్నారు. కొంచెం ‘థెరపీ’ చేయించుకోమని సలహా ఇచ్చారు.


