హామీలు నెరవేర్చండి.. లేదంటే ఉద్యమం తప్పదు

AP: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడంపై AP JAC తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడలో JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆగస్టు 15లోగా ఉద్యోగుల ఆర్థిక, సేవాపరమైన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.



