విజయవాడకు బుడమేరు తరహా ముప్పు.. స్థానికుల్లో ఆందోళన

విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు, తాడేపల్లి పరిసరాల్లో అక్రమ మట్టితవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాల్వగట్లు బలహీనపడి వరదముప్పు పొంచి ఉందనే టెన్షన్ మొదలైంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో కాల్వగట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారినపడే ప్రమాదముంది. APIIC అవసరాల కోసం పోలవరం కాల్వ 167.040 KM వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు పరిమితంగా పగటిపూట చేపట్టాలి. రేయింబవళ్లు వేలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు.



