కరువు సీమలో బంగారు పంట

AP: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు గని ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా పేరొందిన జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ బంగారం ఉత్పత్తిని CM చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా తొలి సంవత్సరం 400కిలోలు, రెండో సంవత్సరం వేయి కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. ఇందుకోసం 405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. జొన్నగిరి మైన్ ద్వారా సుమారు 700 మందికి ఉపాధి దొరుకనుంది.




