← Back to news

ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ కోసం రిలే నిరాహార దీక్ష

By BALADEV PODDU· 19 Aug 2026· Gudivada (R), Gudivada, Krishna
ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ కోసం రిలే నిరాహార దీక్ష

AP: ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఏపీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని జీఓ నెంబర్ 3 సాధన, 1/70 చట్టం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆదివాసీ హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరో పోరాటం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో ఆదివాసులకు వందశాతం రిజర్వేషన్ జీఓపై ప్రత్యేక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

More in Local