← Back to news

మరణశిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు రియాక్షన్!

By sahani· 19 Aug 2026· Andhrajyothy
మరణశిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు రియాక్షన్!

ఉరిశిక్షకు బదులుగా తక్కువ టైమ్‌లో ప్రాణం తీసే ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షలు వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని, ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉరికి 40Min పడుతుందని, ఇంజెక్షన్‌తో 5 నిమిషాల్లో ముగించవచ్చని పిటిషనర్ వాదించారు. అయితే, ఆల్టర్నేటివ్ పద్ధతులపై సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటే భవిష్యత్తులో పరిశీలించవచ్చని, ప్రత్యామ్నాయాలపై కమిటీ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ పేర్కొంది.

More in Current Affairs