మరణశిక్ష పిటిషన్పై సుప్రీంకోర్టు రియాక్షన్!

ఉరిశిక్షకు బదులుగా తక్కువ టైమ్లో ప్రాణం తీసే ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షలు వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని, ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉరికి 40Min పడుతుందని, ఇంజెక్షన్తో 5 నిమిషాల్లో ముగించవచ్చని పిటిషనర్ వాదించారు. అయితే, ఆల్టర్నేటివ్ పద్ధతులపై సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటే భవిష్యత్తులో పరిశీలించవచ్చని, ప్రత్యామ్నాయాలపై కమిటీ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ పేర్కొంది.


