విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు

నీట్ పరీక్ష లీకేజ్పై దిల్లీలో 'చలో సంసద్' ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో 90 మంది నిరసనకారులున్నారు. తలకు బలమైన గాయాలతో కొందరి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.





