పంటల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

TG: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సఖినవీడు గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్ పంట సర్వేను ఏఓ బోయినపల్లి సాయి శివ గురువారం పరిశీలించారు. ప్రతి కమతంలో రైతులు సాగు చేసిన పంటలు, రకాలు, నీటి వనరుల వివరాలను త్వరగా, కచ్చితంగా నమోదు చేయాలని వాలంటీర్లకు సూచించారు. రైతులు సైతం సర్వేలో భాగస్వాములై అవసరమైన వివరాలను అందించాలని కోరారు. డిజిటల్ సర్వేలో నమోదైన పంట వివరాలు పంటల కొనుగోళ్లు, నష్టపరిహారం, రుణాల మంజూరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉపయోగపడతాయని రైతులకు వివరించారు.



