← Back to news

కైట్ ఎగరేస్తుండగా కరెంటు తీగకు తగిలింది.. ఏమైందంటే?

By Mahesh· 16 Aug 2026· Delhi

దిల్లీలోని కొండ్లి ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. టెర్రస్‌పై గాలిపటం (కైట్) ఎగరేస్తున్న ఓ బాలుడి గాలిపటం దారం కరెంటు తీగను తాకడంతో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై గాయాలయ్యాయి. దీంతో పేరెంట్స్, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఓవర్‌హెడ్‌ లైన్లకు దగ్గరలోని టెర్రస్‌లు, భవనాలపై గాలిపటాలు ఎగరేయకూడదు. ముఖ్యంగా మెటల్‌తో ఉన్న దారాలు, మాంజాను అసలు వాడకూడదు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశముంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.