వరకట్న వేధింపులకు 12 ఏళ్ల జైలు శిక్ష

వరకట్న వేధింపులు ఇప్పటికీ సమాజంలో కొనసాగుతుండటంపై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గర్భిణి అయిన భార్యను వరకట్నం కోసం పొట్టనబెట్టుకున్న కేసులో భర్త, అత్తలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రియ మహేంద్ర నిరాకరించారు. ఈ దారుణం వల్ల తల్లితో పాటు కడుపులోని బిడ్డ ప్రాణం కూడా పోయిందని కోర్టు చెప్పింది. ముద్దాయిలకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నేరానికి తగిన శిక్ష పడితేనే సమాజంలో ఇతరులకు భయం ఉంటుందని స్పష్టం చేసింది.


