భారతీయురాలిగానే చనిపోవాలని ఉంది

AP: బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు బుచ్చయ్యచౌదరి అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డారు. మహాలక్ష్మమ్మకు 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది. ఆమె తన సొంతూరులోనే భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలని కోరిక ఉంది. అమెరికా పౌరసత్వం వదులుకున్న ఆమె, భారత పౌరసత్వం కోసం ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తు బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరింది. అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరురాలిగా హోదా దక్కుతుందని కలెక్టర్ తెలిపారు.



