TVK తొలి బడ్జెట్.. ఎవరీ మేరీ విల్సన్?

తమిళనాడు అసెంబ్లీలో అధికార టీవీకే(తమిళగ వెట్రి కళగం) తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగం చదివారు. బి.టెక్, ఎంబీఏ అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి మేనేజ్మెంట్ సైన్స్లో పీహెచ్డీ పొందిన వ్యక్తి ఆయన. జెప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్. 2025 జూన్లో టీవీకేలో చేరి, రాధాకృష్ణన్నగర్ నుంచి పోటీ చేశారు. డీఎంకే ఎమ్మెల్యే జె.జాన్ ఎబెనేజర్ను 49,668 ఓట్ల తేడాతో ఓడించారు.


