తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన

తమిళనాడులోని ఉలంగూరులో జరిగిన తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన వచ్చింది. విడుదలై సిరుతైగళ్ కట్చి(VCK) అధ్యక్షుడు తలైవర్ తిరుమావళవన్ పుట్టిన రోజున నిర్వహించిన ఈ సభలో పది లక్షల మంది పాల్గొన్నారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాన్ని దక్షిణ భారత ప్రజలు అంగీకరించరని సభ తీర్మానం చేసింది. రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్న తీరును వీసీకే తీవ్రంగా వ్యతిరేకించింది. మహాసభ తీర్మానాలకు జనం చప్పట్లతో ఆమోదం తెలిపారు.




