← Back to news

రోడ్డు ప్రమాదం వివాదంగా మారి.. టీచర్‌పై దాడి

By epuri rajaratnam· 28 Aug 2026
రోడ్డు ప్రమాదం వివాదంగా మారి.. టీచర్‌పై దాడి

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులో స్వల్ప రోడ్డు ప్రమాదం వివాదంగా మారి ఉపాధ్యాయుడిపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రోడ్డు ప్రమాదం విషయంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఉపాధ్యాయుడిని కారులో నుంచి బయటకు లాగి యువకులు దాడి చేశారు. చిన్నపాటి వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన సమయంలో ఆవేశానికి లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి దారితీసిన పరిస్థితులు, బాధ్యుల వివరాలను పరిశీలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం వివాదంగా మారి.. టీచర్‌పై దాడి

More in Local