సిద్దాపూర్ డంపు యార్డు మాకొద్దు

TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో డంపుయార్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 641 ను వెంటనే రద్దు చేయాలని షాద్ నగర్, కొత్తూరు మండలాల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ డంపు యార్డు ఏర్పాటయితే ఇక్కడ 10 గ్రామాలు ఇబ్బందులకు గురవుతాయని, భూముల విలువలు పడిపోతాయని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరుతున్నారు.



