← Back to news

పరవాడ ఫార్మాసిటీలో ఫైర్ యాక్సిడెంట్.. ఇద్దరు సజీవదహనం

By డీకే· 23 Jun 2026· అనకాపల్లి జిల్లా

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫార్మాసిటీలోని సౌత్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులూ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

More in AP